రొయ్యల పలావ్ గురించి చాలామంది వినే ఉంటారు. అది ఎలా చెయ్యాలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుందిి. తెలియని వాళ్ళ కోసం....
రొయ్యల పలావ్ ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఏ గిన్నెలో అయితేే వండాలనుకుంటున్నారో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో నూనె పోయండి. నూనె కొంచెం వేడి అయినంక మసాలా దినుసులు (దాల్చిన చెక్క. లవంగాలు. బిర్యానీ ఆకు. యాలకులు కొద్దిగా తీపి కోసం) వేసి బాగా కలపాలి. ఇంకా మీరు ఏవైనా వేసుకునేవి ఉంటే వేసుకోవచ్చు.
ఇప్పుడు కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు తగినన్ని పచ్చి మిరపకాయలు, తాజా పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కలపాలి. (ఉల్లిపాయలు కూరల్లో తరిగినట్టు కాకుండా బిర్యానీలో వేసినట్టు కొంచెం పెద్దగా తరగాలి. పచ్చి మిరపకాయల బదులు పచ్చి మిర్చి పేస్ట్ కూడా వాడవచ్చు). ఇప్పుడు సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలపాలి.
how to make prawns pulao |
how to make prawns pulao |
5 నిమిషాలు స్టౌమీద అలాగే ఉంచండి.
అంతే రుచికరమైన రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా తినండి.
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి